గత ఏడాది నుంచి నేటి వరకూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పాట ఏదైనా ఉంది అంటే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఎంతగానో కట్టిపడేసిన ఈ పాట అందరి నోట వినిపిస్తూనే ఉంది. అంతేకాదు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ఈ పాట. ఇప్పటికి ఈ పాట వస్తుందంటే చాలు చిన్న పెద్ద అందరిలో సరి కొత్త ఉత్సాహం నిండిపోతుంది. తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే బుట్ట బొమ్మ పాట వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ లేచి స్టెప్పులు వేస్తూ ఉంటారు. అంతగా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది బుట్ట బొమ్మ పాట. అల వైకుంఠ పురములో సినిమా లో బుట్ట బొమ్మ పాట పై అటు అల్లు అర్జున్,పూజా హెగ్డే చేసిన డాన్స్ కూడా ఇప్పటికీ అందరికీ ఫేవరెట్గా నిలిచిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో అందమైన బ్యాక్ గ్రౌండ్ తో.. అదిరిపోయే స్టెప్పులు వేసి  బుట్ట బొమ్మ పాట తో అదరగొట్టారు  అల్లు అర్జున్, పూజ హెగ్డే.  ఇక బుట్ట బొమ్మ పాటలో  డాన్స్  ఎవరు చేసినా కూడా అంతగా ప్రేక్షకులు నచ్చరు. ఇటీవలే ఇక్కడ ఒక గ్రూప్ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు.



 ఇటీవలే ఈటీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త షో ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో భాగంగా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక వాళ్ళ టాలెంటు నిరూపించుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక డాన్స్ గ్రూప్ శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎంట్రీ ఇచ్చి బుట్ట బొమ్మ పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది.  డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే డాన్స్ పర్ఫామెన్స్ వస్తు ఉన్నంత సేపు కూడా కన్నార్పకుండా చూస్తాడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు. ఓ వైపు డాన్స్ చేస్తూనే మరోవైపు ఎన్నో అద్భుతమైన స్టెంట్స్  చేస్తారు. ఇక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తిగా చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: