ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ మూవీతో పెద్ద విజయాన్ని అందుకుని తన ఆకట్టుకునే అందం అభినయంతో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది. దాని తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీతగోవిందం మూవీ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు రష్మిక. ఆపై ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరుతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఈ మూవీలో ఆమె చేసిన సంస్కృతి పాత్రకు మంచి పేరు దక్కింది.

దాని అనంతరం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమా ద్వారా కూడా విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగులో ఆడాళ్ళు మీకు జోహార్లు తో పాటు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల తమిళంలో కార్తి సరసన ఆమె హీరోయిన్ గా నటించిన సుల్తాన్ మంచి విజయాన్ని దక్కించుకుంది. అలానే అటు కన్నడ సినిమాల్లో కూడా మంచి అవకాశాలతో కొనసాగుతోంది ఈ బ్యూటీ. ఇక అసలు విషయం ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్ కెరీర్ 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క అఫిషియల్ న్యూస్ నిన్న బయటకు వచ్చింది. తమన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని ఎంపిక చేశారని అంటున్నారు. ఇటీవల రష్మిక ని ప్రత్యేకంగా కలిసిన త్రివిక్రమ్సినిమా యొక్క కథ, కథనాలు వినిపించి ఆమె నుంచి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఇదే గనుక నిజమైతే మరొకసారి సూపర్ స్టార్ కు జోడీగా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: