ఇటీవల కాలంలో
టాలీవుడ్ లోనీ చాలా సినిమాలు ఇతర భాషలలో
రీమేక్ అవుతుండడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగులో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు
బాలీవుడ్ లో
రీమేక్ అవుతూ తెలుగువారి సత్తాను దేశమంతటా చాటి చెబుతుంది. ఆ విధంగా ఇప్పుడు
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మన తెలుగు సినిమాలు ఏవో ఒక సారి చూద్దాం.
నాని హీరోగా నటించిన
జెర్సీ సినిమా ను
బాలీవుడ్ లో
షాహిద్ కపూర్ హీరోగా
గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత.
నాని నిర్మాణంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన హిట్
సినిమా బాలీవుడ్ రీమేక్ ను
రాజ్ కుమార్ రావు చేస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అక్కడి వారు భావించి ఈ సినిమాను ఎంచుకున్నారు. ఇక సౌత్ నుంచి వచ్చిన మరొక
సినిమా ఖైదీ. కార్తీ నటించిన ఈ
సినిమా దక్షిణాదిన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని
బాలీవుడ్ లో
అజయ్ దేవగన్ చేస్తూ ఉండటం విశేషం. ఈ చిత్రంలో
హీరోయిన్ పాత్రకానీ ద్యూయట్ కానీ లేకున్నా కూడా మన ప్రేక్షకులు ఆదరించారు
బాలీవుడ్ లో ఈ
సినిమా ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.