బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో కన్నడ స్టార్ హీరో పునీత్ పార్ధివ శరీరాన్ని చూసిన అభిమానులు, ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. మన టాలీవుడ్ నుండి స్టార్ హీరోలు సైతం పునీత్ కు నివాళులు అర్పించారు. ఇక పునీత్ అమ్మా పార్వతమ్మ, నాన్న కంఠీరవ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు కూడా ఇక్కడే చేసినట్లు సమాచారం. పునీత్ కు నివాళులు అర్పించాడు హీరో శ్రీకాంత్.


అటుపిమ్మట మీడియాతో మాట్లాడుతూ పునీత్ కు నాకు చాలా అనుబంధం ఉన్నదని తెలియజేశారు. పునీత్ మరణ వార్త వినగానే షాక్ అయ్యాను తెలియజేశాడు. కన్నడ లో నేను నటించిన"జేమ్స్" మూవీ కోసం దాదాపుగా 50 రోజుల పాటు పునీత్ తో కలిసి పని చేశాను. కానీ ఈ సినిమా కంటే ముందుగానే మాకు పరిచయం ఉన్నది అని చెప్పుకొచ్చారు. పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ కూడా శ్రీకాంత్ కి మంచి స్నేహితుడా.



జేమ్స్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అందులో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర, తనకు బాడీగార్డ్ గా పునిత్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలియజేశాడు. ఇక ఈ మూవీలో కొన్ని సీన్లు, ఫైట్ సంబంధించి కొన్ని డబ్బింగ్ మిగిలి ఉన్నది అని తెలియజేశాడు. ఒక వారం కిందట పునీత్ నాతో మాట్లాడు. కన్నడలో డబ్బింగ్ స్వయంగా నేనే చెప్పమని నన్ను కోరాడని తెలియజేశాడు.

ఇక అలా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నాకు తన ఇంటి నుంచి భోజనం తెచ్చే వాడు అని తెలియజేశారు శ్రీకాంత్. పునీత్ చాల ఫిట్ గా ఉండేవాడు. పునీత్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలియజేశాడు. పునీత్ తమ అభిమానులను బాగా ఆప్యాయంగా చూసుకునేవాడు అని చెప్పుకొచ్చారు. మీడియాలో ఆయన జిమ్ వ్యాయామం చేస్తూ మరణించినట్లుగా తెలియజేస్తున్నారు. కానీ వాస్తవానికి పునీత్ ఆరోగ్యం రాత్రి నుంచే చాలా ఇబ్బందిగా ఉన్నది అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. ఉదయం ఎనిమిది గంటల సమయంలో వారి ఫ్యామిలీ డాక్టర్ ను కలిసినట్లు చెప్పుకొచ్చారు శ్రీకాంత్. అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్లే మార్గమధ్యంలో మరణించినట్లుగా చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: