అందాల ముద్దు గుమ్మ నిత్యామీనన్ నాని హీరో గా తెరకెక్కిన అలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటన కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం తో నిత్య మీనన్ కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వచ్చాయి. అందు లో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమా లలో నటించిన నిత్యా మీనన్ తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకుంది, ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ నటించిన స్కైలాబ్ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగం గా నిత్య మీనన్ ప్రముఖ మీడియా తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేసింది.

నిత్యామీనన్ మాట్లాడుతూ... నేను ఎవరిని సినిమా అవకాశాలు అడగను అని, వారు తీసే సినిమా కు నా వల్ల న్యాయం జరుగుతుంది అని వారు అనుకొని నా దగ్గరకు వచ్చి కథ చెబితే, ఆ పాత్ర నాకు నచ్చినట్లయితే నేను ఆ సినిమా ను చేస్తాను అని నిత్యా మీనన్ తెలియజేసింది. అలాగే భీమ్లా నాయక్ సినిమా లో నటించమని చిత్ర బృందం అడిగితేనే ఒప్పుకు న్నట్లుగా ఈ ముద్దు గుమ్మ చెప్పింది,  త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నిత్య మీనన్ మాట్లాడుతూ... త్రివిక్రమ్ నన్ను ఒక రౌడి అమ్మాయిల చూస్తాడు,  అందుకే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో నాకు రౌడీ అమ్మాయి పాత్రను ఇచ్చాడు.  ప్రస్తుతం తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా నేను రౌడీ అమ్మాయి లాగానే కనిపిస్తాను అంటూ నిత్యా మీనన్ తెలియ జేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: