టాలీవుడ్ తొలితరం సూర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గురించి మన తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలిసారిగా తేనెమనసులు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన కృష్ణ ఆ తరువాత నుండి దాదాపుగా 350 కి పైచిలుకు సినిమాల్లో యాక్ట్ చేసి టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎందరో ప్రేక్షకాభిమానుల మనసులు గెలుచుకున్నారు.

ఇక ప్రస్తుతం ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా తండ్రిని మించిన తనయుడిగా నేటితరం సూపర్ స్టార్ గా కోట్లాదిమంది ఫ్యాన్స్ ని ప్రేక్షకులని రంజింపచేస్తూ ఒక్కో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం కృష్ణ మనవడు, ఆయన పెద్ద కుమార్తె పద్మావతి తనయుడైన గల్లా అశోక్ మరొక నాలుగు రోజుల్లో హీరో మూవీ ద్వారా టాలీవుడ్ కి నటుడిగా పరిచయం కానున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గల్లా పద్మావతి ఈ సినిమాని నిర్మించారు. గల్లా అరుణకుమారి, కృష్ణ సమర్పకులుగా వ్యవహరించిన హీరో సినిమా మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కింది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ అందరిలో సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా మ్యాటర్ ఏమిటంటే గల్లా జయదేవ్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు, అంతకముందు మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై కొరటాల శివ తీసిన భారీ ఇండస్ట్రీ హిట్ మూవీ శ్రీమంతుడుకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు అశోక్. తన ఫస్ట్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుండడంతో నిన్న మైత్రి మూవీ మేకర్ వారు తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అశోక్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చదువుల అనంతరం మావయ్య, తాతయ్య ఆశీస్సులతో యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ వంటి వాటిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న గల్లా అశోక్ హీరో మూవీలో తన యాక్టింగ్ అదరగొట్టారని, రాబోయే రోజుల్లో మావయ్య మహేష్ మాదిరిగా అశోక్ కూడా టాలీవుడ్ లో నటుడిగా మంచి పేరు అందుకోవడం ఖాయం అని హీరో యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: