ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ నిన్న మరణించారు. అతను మంచి ఆట గాడు అని అందరు అతణ్ణి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ శిల్పాశెట్టి తనతో ఏర్పడ్డ సన్నీవేశాలను గుర్తు చేసుకున్నారు.. అతను చాలా మంచి వాడు. అతను మనస్తత్వం కూడా మంచిదే అని శిల్పా అన్నారు.. 2016,లో ఈ ఆటగాడు ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే.. అందరితో సరదాగా గడిపాడు. అంతేకాదు శిల్పా శెట్టితో కలిసి షేన్ పేకాట ఆడారు. అప్పుఫు శిల్పా శెట్టి కి ఆ ఆటలోని మెళకువలు కూడా నేర్పించారు. శిల్పా శెట్టితో పాటు ఆమె భర్త బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్ర, మరికొంత మంది ముఖ్యమైన వాళ్ళతో  కలిస షేన్ పేకాట ఆడారు.


అంతే కాదు వాటిలోని మెలకువలను శిల్పాకి నేర్పించారు స్టార్ క్రికెటర్.. దాంతో ఆమె ఆ ఆట ను మరింత బాగా ఆడటం ప్రారంభించింది. ఇకపోతే ఇతనికి  క్రికెట్ తో పాటు పేకాటలో మంచి ప్రావీణ్యం ఉంది.  2015 లో వరల్డ్ సిరీస్ ఆఫ్ పోకర్ లో పార్టిస్పేట్ చేశారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన పాల్గోన్నారు. 2016 లో శిల్పా శెట్టి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే వార్న్ పోకర్ ను శిల్పాకు నేర్పించారు. అందులో సీక్రట్స్ ను శిల్పాకు వివరించారు.. అలా అతను శిల్పాకు ట్రైనర్ అయ్యారు.


ఇకపోతే పోకర్ ఆట ఆడుతూ కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చారు, ఆ ఫోటో లను తమ సోషల్ మీడియా పేజ్ లో కూడా అప్ లోడ్ చేశారు. ఈ ఫోటోస్ లో షేన్ వార్న్ తో పాటు శిల్పా శెట్టి తో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఉరకలు వేస్తూ ఆటను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. క్రికెటర్ మరణ వార్థను విని షాక్ అయిన వీళ్ళు ఆయనకు సంతాపం ప్రకటించారు. షేన్ తో కలిసి ఆడుతున్న రెండు ఫోటోస్ ను ఆమె శేర్ చేశారు. అలాగే లెజెండ్స్ లివ్ ఆన్ అంటూ ట్యాగ్ కూడా రాసిన శిల్పా శెట్టి.. షేన్ వార్న్ తన పోకర్ గురూగా తెలిపింది. వార్న్ తో కలిసి ఉన్న ఫోటోలను శిల్పా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ప్రస్తుతం వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: