ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న వారిలో కీర్తి సురేష్, పూజా హెగ్డే ముందు వరుసలో నిలుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. నాగ చైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా తీసిన ఒక లైలా కోసం మూవీ ద్వారా పూజా హెగ్డే తెలుగు చిత్ర సీమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన నేను శైలజ మూవీ ద్వారా కీర్తి సురేష్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నుండి కెరీర్ పరాగమా మధ్యలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ ఇద్దరు యువ భామలు ఆ తరువాత వరుసగా కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు సాధించి తమని తాము నిరూపించుకున్నారు.
ఇక ఆ సక్సెస్ లతో వారికి ఎందరో ప్రేక్షకాభిమానుల ఆదరణ లభించింది. అయితే ఇటీవల మాత్రం ఈ ఇద్దరికీ టాలీవుడ్ లో వరుసగా పరాజయాలు వచ్చాయి. ఇటీవల కీర్తి నటించిన గుడ్ లక్ సఖి, పెద్దన్న, మరక్కార్ అలానే పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో వీరు రాబోయే రోజుల్లో ఎంత మేర సక్సెస్ కొడతారేమో ఏమో అని అప్పుడే టాలీవుడ్ వీరిపై చర్చలు మొదలెట్టేసింది. అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం మహేష్ తో సర్కారు వారి పాట సినిమాలో ఆయనకి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా తదుపరి ఆయన త్రివిక్రమ్ తో చేయనున్న మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

మరోవైపు ఇప్పటికే సర్కారు వారి పాట మూవీపై టాలీవుడ్ లో ఫుల్ పాజిటివ్ బజ్ ఉండడంతో తప్పకుండా ఈ మూవీతో కీర్తి సక్సెస్ కొడుతుందని, అలానే మహేష్ త్రివిక్రమ్మూవీ పై కూడా భారీ స్థాయి అంచనాలు ఉండడంతో పాటు త్రివిక్రమ్ సినిమాల్లో వరుసగా సక్సెస్ ట్రాక్ కలిగిన పూజా హెగ్డేమూవీ ద్వారా మరొక సక్సెస్ అందుకుంటుందని, ఆ విధంగా మహేష్ బాబు ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కి మంచి సక్సెస్ ని అందించే ఛాన్స్ ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి వీరిద్దరి విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: