‘సీతారామం’ మూవీ విడుదలై మూడు వారాలు దాటిపోయినా ఇంకా ఆసినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు కలెక్ట్ చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మూవీలో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ ఈ ఒక్క సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.


సినిమా విడుదల అయ్యేంతవరకు ఈమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు దర్శకులు టాప్ హీరోలు ఇలా అందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం కొరటాల జూనియర్ ల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న పాన్ ఇండియా మూవీలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడానికి ఏకంగా ఆమె 2కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రెండవ సినిమాకు ఒక కొత్త హీరోయిన్ కు ఆ రేంజ్ లో పారితోషికం ఇవ్వడం ఒక రికార్డు. అయితే ఆమెకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ నిర్మాతలు ఆమెకు జాతీయ స్థాయిలో ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ పారితోషికాన్ని ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.


కొరటాల సినిమా కథలలో హీరోయిన్ కు మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. మంచి నటిగా కూడ మృణాల్ కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఈమూవీ కథ రీత్యా ఆమె హీరోయిన్ గా అన్నివిధాల సరిపోతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ ఎంపిక జరిగింది అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత తారక్ కు బాలీవుడ్ లో ఏర్పడిన క్రేజ్ మరింత పెంచాలి అన్న ఉద్దేశ్యంతో తీయబడుతున్న ఈ మూవీలో మృణాల్ కాంబినేషన్ తో తారక్ చాల సులువుగా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతాడని ఈవ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు టాక్..  




మరింత సమాచారం తెలుసుకోండి: