ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "లూసిఫర్" కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మక్కీకి మక్కీ దించకుండా తెలుగు నేటివిటీకి తగినట్లుగా కొన్ని మార్పులను చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో నయనతార పాత్ర బాగా హైలైట్ అవుతుందని చిత్ర బృందం తెలుపుతోంది. ఇందులో ఆమె సత్య ప్రియ జైదేవ్ అనే ఒక దైర్యవంతురాలైన మహిళగా నటిస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశాభావాన్ని అందరూ వ్యక్తపరుస్తున్నారు. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్, పుర జగన్నాధ్ లు నటిస్తున్నారు.
ఈ సినిమాను మెగాస్టార్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ బాణీలను అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5 వ తేదీన దసరా కానుకగా విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా నుండి పాటలు విడుదల కానున్నాయి. ఈ సినిమా హిట్ కావడం చిరంజీవికి చాలా అవసరం... ఇప్పటికే మొన్ననే వచ్చిన ఆచార్య డిజాస్టర్ గా మిగిలింది.