నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ మూవీ కిరిక్ పార్టీ తో అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకొని ,  ఆ తర్వాత ఛలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛలో మూవీ తో మంచి విజయాన్ని ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న ఈ గ్లామరస్ బ్యూటీ ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ ను సంపాదించుకుంది.

ఈ సంవత్సరం రష్మిక మందన ,  దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాగవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతా రామం అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా అదిరి పోయే రేంజ్ లో ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశాన్ని దక్కించు కున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఆషికి 3 మూవీ లో రష్మిక మందన కు హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు, ఈ మధ్యే ఈ మూవీ కథను రష్మిక మందన కు వినిపించగా ఈ ముద్దు గుమ్మ కూడా ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: