సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి ఈమధ్య మరణించిన విషయం తెలిసిందే. ఆమె 11వ రోజు కార్యక్రమాలు అన్నీ మహేష్ దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా తన తండ్రికి అడుగడుగునా మానసిక ధైర్యం కలిగిస్తూ అన్నీ తానై మహేష్ చూసుకున్న విషయాన్ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ తన భార్య పిల్లలతో కృష్ణ పక్కన బాసటగా నిలిచి ఉన్న ఫోటోను షేర్ చేసింది.


అంతేకాదు తన అత్తగారు ఇందిరాదేవి తన తల్లికి మించిన వ్యక్తి అనీ ఆమె ఎక్కడ ఉన్నా ఆమె ఆశీస్సులు తమ కుటుంబం పై ఉంటాయని భావయుక్తంగా కామెంట్స్ చేసింది. ఒకే సంవత్సరంలో కృష్ణ కుటుంబంలో రెండు విషాదాలు జరిగాయి. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ ఈసంవత్సరం ప్రారంభంలో చనిపోతే ఈమధ్యనే కృష్ణ భార్య ఇందిరా దేవి చనిపోయిన షాక్ లను కృష్ణ మానసిక నిబ్బరంతో అధిగమించాడు.


తన రోల్ మోడల్ తన తండ్రి కృష్ణ మాత్రమే అని ఓపెన్ గా తరుచూ చెప్పే మహేష్ ఈకష్ట కాలంలో తన తండ్రి పక్కన బాసటగా ఉండటమే కాకుండా తన షూటింగ్ లను కూడ క్యాన్సిల్ చేసుకుని ప్రస్తుతం తన తండ్రి కృష్ణ వద్దనే ఉంటున్నాడు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షెడ్యూల్ ఒకటి పూర్తి అయినప్పటికీ మరొక షెడ్యూల్ ప్రారంభానికి మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈమూవీలో మహేష్ చాల కొత్త లుక్ లో డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని మాస్ అవతారాన్ని కూడ చూపెట్టబోతాడు అని అంటున్నారు.


ఈమూవీ సమ్మర్ రేస్ లో ఏప్రియల్ లో విడుదల కావలసి ఉంది. అయితే ఇప్పుడు మహేష్ కొంత షాక్ లో ఉన్న పరిస్థితులలో ఈ షాక్ నుండి తేరుకుని ఎంత త్వరగా ఈమూవీ సెట్స్ పైకి రాగలిగితే అంత త్వరగా ఈమూవీని పూర్తి చేసి అనుకున్న రిలీజ్ డేట్ కు విడుదల చేయాలని త్రివిక్రమ్ చాల గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: