నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస లతో ఫుల్ జోష్ మీదున్నారు. బ్యాక్ టు బ్యాక్ లు లైనప్ చేసిన బాలయ్య ఆయా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ లో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ స్టిల్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈలో బాలయ్యకు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ నటిస్తోంది. అలాగే మరో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే ఈ నుంచి టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్నారు బాలయ్య.ఇటీవలే అనిల్ ఎఫ్3 తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు నటసింహం తో కలిసి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు అనిల్. ఇదిలా ఉంటే ఈ లో బాలయ్య కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ లో హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ లో బాలయ్య సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది.
బాలయ్య కోసం అనీల్ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషను రంగంలోకి దింపనున్నారట. గతంలో బాలకృష్ణ నటించిన లయన్ లో హీరోయిన్ గా చేసింది త్రిష. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో కలిసి ఈ చిన్నది నటించనుందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే త్రిష మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో నటించిన విషయం తెలిసిందే. ఐశ్వర్య రాయ్ తో పోటీగా నటించింది త్రిష. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు బాలయ్య కు ఓకే చెప్తుందా అన్నది సందేహంగా మారింది. దానికి కారణం ఈ లో బాలకృష్ణ పక్కన హీరోయిన్ అంటే కథ ప్రకారం శ్రీలీలకు తల్లిగా నటించాలి. మరి తల్లి పాత్రకు త్రిష ఓకే చెప్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: