మహానటి సావిత్రి తర్వాత తెలుగు ప్రేక్షకులు అందరికీ అంతలా కనెక్ట్ అయిన హీరోయిన్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు సౌందర్య. తెలుగు ఇంటి ఆడపడుచుల ఇక అందరి ఇంటికి చేరువైంది సౌందర్య. తన సినిమాలతోనే కాదు మంచితనంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఇలా సౌత్ ఇండస్ట్రీలో హోమ్లి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.


 టాలీవుడ్ తో మాత్రమే తన కెరీర్ను ఆపేయకుండా బాలీవుడ్ లో కూడా నటించి అక్కడ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది అని చెప్పాలి. సౌత్ లో ఉన్న అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది అని చెప్పాలి.  ఇక అప్పట్లో స్టార్ హీరోలు అందరికీ కూడా పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించుకున్న సౌందర్య ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అయితే నేటి తరంలో నాటి తరంలో ఏ హీరోయిన్ చేయని ఒక రిస్క్ సౌందర్య కెరియర్లో చేసింది అన్న విషయం తెలిసిందే.


 అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా కొనసాగిన బాబు మోహన్ తో స్టార్ హీరోయిన్ సౌందర్య ఏకంగా ఒక పాటలో చిందులు వేసింది.  ఇక ఇది కాస్త అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మాయలోడు సినిమాలో చినుకు చినుకు అందెలతో అనే ఒక అద్భుతమైన పాటలో మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకుంది. అప్పటికే ఫుల్ బిజీ హీరోయిన్ అయినా సౌందర్య ఒక స్టార్ హీరోతో కాకుండా ఒక సాదాసీదా కమెడియన్ తో ఐటమ్ సాంగ్ చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసం ఇందులో చేసేందుకు ఒప్పుకున్న సౌందర్య.. ఒకవేళ బాబు మోహన్ కనుక తనను తాకితే కొట్టేస్తానంటూ సరదాగా అప్పట్లో దర్శకుడితో చెప్పిందట. పాటలో చూసుకుంటే మోహన్ బాబు సౌందర్య మధ్య కూడా ఎక్కడ  ఎక్కువగా ముట్టుకోవడాలు పట్టుకోవడాలు కనిపించవు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: