కోలీవుడ్.. టాలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఈమె దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాల పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతోంది.. వివాహం అనంతరం కూడా ఆమె డిమాండ్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. అయితే సినిమా ప్రమోషన్లకు రావడానికి ఇబ్బంది పడే నయనతార ..మొదటిసారి తన భర్త నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ కి హాజరయ్యింది.

తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలను అలాగే తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా మీడియాతో పంచుకున్న విషయం తెలిసిందే . అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన బ్రేక్ లెస్ హర్రర్ చిత్రం కనెక్ట్.. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే బోల్తా కొట్టింది. అయితే ఇక్కడే నయనతార విగ్నేష్ శివన్ లు చేసిన పనికి ఛీ.. పాపులారిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ వీరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలు విషయంలోకెళితే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులకు నచ్చింది అంటే వెంటనే వారు పాజిటివ్ రివ్యూ ఇస్తారు. కానీ కథ , కంటెంట్ వారికి నచ్చకపోతే వెంటనే ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ క్రమంలోనే నయనతార - విఘ్నేష్ శివన్ ల కనెక్ట్ మూవీకి కూడా ప్రీమియర్ షో ల నుంచి వచ్చిన తొలి స్పందన నెగిటివ్గా మారింది. దీంతో నెటిజనులు ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో నయనతార - విగ్నేష్ కనెక్ట్ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి సినీ ప్రియులకు డబ్బులు కూడా చెల్లించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అలా డబ్బులు తీసుకున్న వారు కొంతమంది ఈ సినిమాపై పాజిటివ్గా రివ్యూలు ఇస్తున్నా తొలి సమీక్షలను నెటిజనులు ఇప్పుడు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా సక్సెస్ అనిపించుకోవడానికి ఇంతలా దిగజారాలా అంటూ కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: