సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే ఆ సినిమా వివిధ భాషలలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ భాష ఇండస్ట్రీలో తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది.  లేకపోతే అక్కడి ప్రజలు సినిమాను ఆదరిస్తారు అన్న నమ్మకాలు కూడా ఉండవు.  ఈ క్రమంలోని విజయ్ కూడా తన సినిమా విషయంలో తప్పుచేసి పూర్తిగా నష్టపోయారని చెప్పడంలో సందేహం లేదు.  అసలు విషయంలోకి వెళితే.. వంశీ పైడిపల్లి తెలుగు డైరెక్టర్ దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే ఈ సినిమాను తమిళ్ లో వారిసు పేరిట రిలీజ్ చేశారు కానీ సినిమా ఎక్కడా కూడా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది

అయితే ఈ సినిమా తెలుగులో సక్సెస్ కావాల్సి ఉంది కానీ విజయ్ ప్రమోషన్స్ కి హాజరు అవ్వకపోవడం ట్రైలర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు తెలుగులో జరిగినప్పుడు ఆయన ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు తెలుగులో ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. దీంతో తెలుగు ఆడియన్స్ పూర్తిగా నిరాశ చెందారని చెప్పవచ్చు. ఫలితంగా సినిమా డిజాస్టర్ గా మిగిలింది అయితే ఈసారి విజయ్ చేసిన తప్పు ధనుష్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంయుక్త మేనన్ తో ధనుష్ హీరోగా చేస్తున్న సినిమా సార్..

ఈ సినిమాను తమిళ్లో వాతి పేరిట రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.  కానీ ట్రైలర్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరపగా.. ఈ  ఈవెంట్ కి ధనుష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.  అంతే కాదు తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆయన ప్రతి ఇంటర్వ్యూ ఇస్తూ తెలుగు అభిమానులకు దగ్గరవుతున్నాడు.  దీంతో ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఇది చూసిన తెలుగు ఆడియన్స్ విజయ్ కంటే ధనుష్ చాలా బెటర్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: