కాగా రేపు తమిళ్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్ ఘనంగా థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా విశ్వాసంతో ఉన్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇక ఏకంగా తమిళ్ లో ఈ సినిమా 8 వారాలు ఆడుతుందని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే వెంకీ అట్లూరి దర్శకుడిగా మారిన అనంతరం తెరకెక్కించింది కేవలం మూడు చిత్రాలే. మొదటి సినిమా తొలిప్రేమతోనే ఘనంగా తన ప్రస్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమకు చాటాడు.
అయితే ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు మిస్టర్ మజ్ను మరియు రంగ్ దే సినిమాలు నిరాశను మిగిల్చాయి. ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మంచి సందేశం కలిగిన కథతో "సార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ధనుష్ ఒక ఉపాధ్యాయుడుగా నటిస్తుండగా , అతనికి సరసన సంయుక్త మీనన్ చేసింది. మరి ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అటు ధనుష్ కి మరియు డైరెక్టర్ వెంకీ అట్లూరి కి బ్రేక్ ఇస్తుందా చూడాలి.