ఈ మధ్యకాలంలో ఇతర భాషలలోని నటీనటుల సైతం ఎక్కువగా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు సైతం మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా స్టార్ హీరో దళపతి విజయ్ కూడా మరొకసారి తెలుగు దర్శకుడు తో సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫిలింనగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ తన లైనప్ లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయగానే తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ ఏడాది సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారిసు సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రం ఓవరాల్ గా  రూ.300 కోట్ల రూపాయలను కలెక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. తెలుగులో ఈ సినిమాని వారసుడు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా తెలుగులో వాయిదా పడేసరికి ఇక మీదట విజయ్ తెలుగు దర్శకులతో సినిమా చేయాడని అందరూ అనుకున్నారు.. కానీ ప్రస్తుతం విజయ్ ,లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న లియో చిత్రంలో నటిస్తున్నారు.



సినిమా మోస్ట్ అవైడెడ్ సినిమా గా మారుతోంది.ఈ సినిమా షూటింగ్ జూలై నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత విజయ్, అట్లీ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది ఈ సినిమాతో హ్యాట్రిక్ హీట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డైరెక్టర్ బాలయ్యతో ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి విజయ్ గోపీచంద్ కాంబినేషన్లో సినిమా ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: