సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఏప్రిల్ 21 వ తేదీన మంచి అంచనాలు నడుమ తెలుగు భాషలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

 దానితో ఈ సినిమా ఇప్పటి వరకు అనేక రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్నప్పటికి ఈ మూవీ తర్వాత విడుదల అయిన సినిమాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రేంజ్ లో కలెక్షన్ లని రాబట్ట లేకపోతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయిన ఉగ్రం ... రామబాణం ... పిఎస్ 2 మూవీ ల కంటే విరూపాక్ష మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుంది. ఉగ్రం మూవీ విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల షేర్ కలక్షన్ చేయగా , రామబాణం సినిమా విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ విడుదల అయిన 17 వ రోజు ఈ మూడు మూవీ ల కంటే ఎక్కువగా షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల షేర్ కలక్షన్ వసూలు చేసి ఈ మూడు మూవీ లను కూడా వినకు నెట్టేసింది. ఇలా ఇప్పటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ జోష ను చూపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: