ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక తక్కువ సమయంలోనే యూత్ లొ ఊహించిన రీతిలో ఫాలోయింగ్ సంపాదించాడు. తన సినిమాలతోనే కాదు తన యాటిట్యూడ్ తో కూడా అభిమానులను గెలుచుకున్నాడు విజయ్ దేవరకొండ. అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి రౌడీ హీరోగా కూడా మారిపోయాడు అని చెప్పాలి. అప్పుడెప్పుడో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాతో ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఇక ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడాఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు.



 ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతార మెత్తిన విజయ్ దేవరకొండ.. ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకొస్తున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో అయితే ఇండస్ట్రీలో సెన్సేషన్స్ సృష్టించి స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు గాను రౌడీ హీరో కి ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. అయితే  ఆ ఫిలింఫేర్ అవార్డుని విజయ్ దేవరకొండ ఏకంగా 25 లక్షలకు అమ్మేశాడట. ఇక దీని అమ్మకానికి వేలం పెట్టి మరి 25 లక్షలకు అమ్మేసినట్లు తెలుస్తోంది. విజయ్ కి అంత సమస్య ఏంవచ్చింది.. ఫిలిం ఫేర్ అవార్డు అమ్మేయడమేంటి అని అనుకుంటున్నారు కదా.



 అయితే విజయ్ దేవరకొండ తనకు వచ్చిన ఫిలింఫేర్ అవార్డును అమ్మేసింది తన అవసరాల కోసం కాదు. సేవా కార్యక్రమం కోసం. ఏకంగా ప్రజాసేవ కోసం తాను సంపాదించుకున్న ప్రతిష్టాత్మక అవార్డును సైతం విజయ్ దేవరకొండ అమ్మేశాడు. ఇక ఇలా వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా ప్రజాసేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చాడు విజయ్ దేవరకొండ.  ఇలా గొప్ప పని చేయడం ద్వారా రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాను హీరో అని నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: