సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఏ రేంజ్ లో ప్రాముఖ్యత ఉంటుందో అదే విధంగా సెంటిమెంట్ సన్నివేశాలకు కూడా ప్రాముఖ్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో కొనసాగనున్నట్లు దాని కోసం ఈ సినిమాలో సిస్టర్ పాత్రకు ఒక పవర్ఫుల్ నటిని తీసుకుని ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 5 వ తేదీన గానీ 6 వ తేదీన గాని ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ నిర్విరామంగా 3 నెలల పాటు కొనసాగనున్నట్లు ... ఈ మూడు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట లాంటి వరుస విజయాల తర్వాత మహేష్ నటిస్తున్న మూవీ కావడం తో ఈ మూవీ పై మహేష్ అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: