టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఒకప్పుడు రెబెల్ హీరోగా పాపులారిటీని సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ కి ఇంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా. ఇక ఆ సినిమా తర్వాత మిగతా నటీనటులు పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ ప్రభాస్ కి మాత్రం ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కింది. ఆ సినిమా తర్వాత ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఇండస్ట్రీలో నేను నంబర్ వన్ హీరో ప్లేస్ కి చేరుకున్నాడు ప్రభాస్ .తాజాగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో దాదాపుగా 2000 కోట్లకు పైగానే ఖర్చు చేసి తీసారట. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గట్టిగానే చేయబోతున్నారట చిత్రబృందం. ఇదిలా ఉంటే ఇంకా తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన శ్రీరామ్ అన్న పాట సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ అభిమానులతో పాటుగా సినీ ప్రేక్షకులను సైతం ఈ పాట వేరే లోకానికి తీసుకెళ్లినట్టుగా గ్రాఫిక్స్ చాలా చక్కగా క్రియేట్ చేశారు.

ఇదిలా ఉంటే ఇక తాజాగా ప్రభాస్సినిమా కోసం ఒక త్యాగం చేశాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినలేదు.. అని పూర్తిగా వెజ్ భోజనం చేశారని.. ఇలా చేయడానికి కారణం ఆయనకు ఆ దేవుడి మీద ఉన్న నమ్మకమే..అని అంటున్నారు. ఏదేమైనా ఇంతలా టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ మన ప్రభాస్ మాత్రం దేవుని ఇంతలా నమ్ముతున్నాడు. ఇక ఇలాంటి ఒక స్టార్ హీరో మన సినీ ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అని అంటున్నారు ప్రభాస్ అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: