
సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక సీక్వెల్ పై ప్రభాస్ నుంచి ఎలాంటి స్పష్టమైన అప్డేట్ కూడా కనిపించకపోవడంతో అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తి అవ్వడానికి మరో ఏడాదిపైనే కావస్తోంది.ఈ చిత్రం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే సలార్ 2 సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఈసారి సలార్ 2 సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దిల్ రాజు రావణం అనే చిత్రాన్ని కూడా అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత కనిపించలేదు. కానీ ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. రాజా సాబ్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తో కూడా స్పిరిట్ సినిమాని చేస్తున్నారు ప్రభాస్.