టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ,క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అబోవ్ యావరేజ్ టాక్ తో నిలిచినప్పటికీ కలెక్షన్స్ భారీగానే రాబడుతోంది. మొదటిసారి పాన్ ఇండియా చిత్రం కావడం చేత మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ కూడా చిత్ర బృందం గ్రాండ్ గానే చేశారు.


ఇలాంటి సందర్భంలోనే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఒక రాపిడ్ ఫైర్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు యాంకర్ వేయగా సమాధానాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఆలియా భట్, కృతిసనన్, దీపికా పదుకొనే, కియారా అద్వానీలలో ఎవరంటే ఇష్టమని అడగగా పవన్ కళ్యాణ్ ఆలోచించకుండా కృతి సనన్ తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించిన కంగనా రనౌత్ యాక్టింగ్ అన్న కూడా ఇష్టం అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.


ఇక మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు అలనాటి హీరోయిన్ శ్రీదేవి నటన అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అందుకు సంబంధించి తాజాగా కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలు అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయాలను వైరల్ గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఓజి, ఉస్తాద్ సింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి ఈ సినిమాల ను కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: