
జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తున్నారు. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 31న విడుదలైన ట్రైలర్కు 30 లక్షలకు పైగా వీక్షణలతో విశేష స్పందన వచ్చింది. నిర్మాత జగదీష్ మాట్లాడుతూ, సినిమా అంచనాలను అందుకుంటుందని, త్వరలో ప్రపంచవ్యాప్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.ట్రైలర్కు విమర్శకుల ప్రశంసలు లభించాయని దర్శకుడు ఆర్యన్ సుభాన్ వెల్లడించారు.
ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్గా ఉంటుందని, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ మాట్లాడుతూ, ట్రైలర్ స్పందన అద్భుతంగా ఉందని, సినిమా సస్పెన్స్తో కూడిన అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ చిత్రం వారి బృందం కష్టానికి ఫలితమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం, హజరత్ షేక్ కెమెరా, వర ప్రసాద్ ఎడిటింగ్, గ్యాని బీజీఎం అందించారు. శ్రీనివాస్ తేజ, రామారావు సాహిత్యం, వి. నాని, పండు కళా దర్శకత్వం నిర్వహిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు