ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్తితి మరీ దారుణంగా తయారైంది..దీంతో రాజకీయ భవిష్యత్ కోసం....బొత్స వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు...అలాగే జగన్ క్యాబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి అనేక కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 100 శాతం మార్పులు జరగడం ఖాయమని ప్రచారం నడుస్తోంది.
అంటే బొత్స ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వకుండానే బొత్స పదవి ఊడిపోతుంది. సీనియర్ నేతగా ఉన్న బొత్స పదవి పోవడం అంత సులువా? అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే బొత్స లాంటి వారు క్యాబినెట్లో ఉంటేనే...వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. బొత్స, పెద్దిరెడ్డి, బాలినేని లాంటి సీనియర్ల అవసరం జగన్కు ఎంతైనా ఉంది...అలాంటప్పుడు వారిని సైడ్ చేయడం వల్ల పార్టీకి కాస్త ఇబ్బంది అవుతుంది.