సరే.. ఇలాంటివన్నీ సాధారణమే.. కానీ.. ముంబయిలో మాత్రం ఓ వింత కారణంతో విడాకులు తీసుకుంటున్నారట. వంద విడాకుల కేసుల్లో 3 కేసులు ఈ కారణంతో విడాకులు జరుగుతున్నాయట. మరి ఆ వింత కారణం ఏంటో తెలుసా.. ట్రాఫిక్ సమస్య.. అవును.. నిజమే.. ట్రాఫిక్ సమస్య కారణంగా ముంబయిలో మూడు శాతం విడాకుల కేసులు ట్రాఫిక్ సమస్య వల్లే వస్తున్నాయట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య.
ఈ మాట ఓ మాజీ సీఎం భార్యగా కాకుండా.. ఓ సగటు ముంబయివాసిగా చెబుతున్నానంటోంది దేవేద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలతో మరాఠా రాజకీయాలు వేడెక్కాయి. ముంబయి రోడ్ల తీరును తప్పుపట్టి అమృత.. అక్కడి శివసేన సర్కార్ను టార్గెట్ చేశారు. ముంబయిలో ట్రాఫిక్ కారణంగా ప్రజలు తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారని ఆమె అంటున్నారు. అందుకే ముంబయిలో మూడు శాతం జంటలు విడాకులు తీసుకోవడానికి ట్రాఫిక్ కారణమంటున్నారు.
ముంబయిలో ఒక్కసారి ఇంటి నుంచి బయటికి వెళితే అన్నీ గుంతలే కనిపిస్తున్నాయన్నారు. ఈ గుంతల రోడ్లపై ట్రాఫిక్ దారుణంగా ఉందని.. అందుకే ముంబయిలో జంటలు విడాకులకు దరఖాస్తులు చేస్తున్నారని అమృత అంటున్నారు.