మళ్ళీ కృష్ణా జిల్లాని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే...మామూలుగా కృష్ణా జిల్లాలో టీడీపీకి చాలా బలం ఉంది...కానీ గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచింది..దీంతో కృష్ణాలో టీడీపీకి భారీగానే నష్టం జరిగింది. ఇక ఆ నష్టాన్ని పూడ్చడానికి టీడీపీ నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో చాలావరకు పార్టీని పైకి లేపారు. ముఖ్యంగా టీడీపీలో ఉన్న కమ్మ నేతలు..పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం...తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని బలోపేతం చేయడంలో చాలావరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నారు. మామూలుగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి బలం ఎక్కువ ఉంది...కానీ గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీ సత్తా చాటలేకపోయింది...పార్లమెంట్‌లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం నడిచింది. ఒక్క విజయవాడ తూర్పులోనే టీడీపీ గెలిచింది.

అయితే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్‌లతో కలిసి నెట్టెం పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్తితి మెరుగైంది. మైలవరం లాంటి నియోజకవర్గంలో టీడీపీ లీడ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అలాగే విజయవాడ సెంట్రల్‌లో టీడీపీకి బలం పెరిగింది. అదేవిధంగా జగ్గయ్యపేట, నందిగామ లాంటి కంచుకోటల్లో టీడీపీ పికప్ అయింది.

ఈ రెండుచోట్ల టీడీపీ పికప్ అవ్వడంతో నెట్టెం కీలక పాత్ర పోషిస్తున్నారు. కమ్మ నేతగా ఉన్న నెట్టెం...ఈ రెండుచోట్ల ఉన్న కమ్మ వర్గాన్ని యాక్టివ్ చేసి దూకుడుగా పనిచేయిస్తున్నారు. దీంతో రెండు చోట్ల టీడీపీ బలం బాగానే పెరిగింది. అటు వైసీపీ హవా ఉన్న తిరువూరులో కూడా టీడీపీ బలం పెంచే దిశగా నెట్టెం పనిచేస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మొత్తానికి ఈ కమ్మ నేత..విజయవాడ పార్లమెంట్ పరిధిలో సైకిల్‌ని సైలెంట్‌గా చేసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: