ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నిక కబడడం వలన వారితో ప్రత్యేక అనుబంధాన్ని పెట్టుకున్నాడు శ్రీధర్ రెడ్డి. అందుకే తన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను పిలిచి మరీ అడిగేస్తాడు. అయితే ఇది అలా ఇలా వెళ్లి ఏకంగా తన సొంత పార్టీ పాలనపైనే రెచ్చిపోయేలా చేసింది. ఫలితంగా సీఎం ఆఫీస్ నుండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నిన్న ఫోన్ వచ్చింది.. సోమవారం అనగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు కలవాలని సూచించారు. అందులో భాగంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ను కలిశారు.
అయితే వీరిద్దరి మధ్యన ఏమి జరిగింది ? జగన్ శ్రీధర్ రెడ్డి పై ఫైర్ అయ్యారా లేదా మంచిగానే ఎలా మెలగాలో సెలవిచ్చారా అన్నది తెలియదు. మొత్తానికి శ్రీధర్ రెడ్డిని పిలిపించుకోవడం ద్వారా పార్టీలో పార్టీ మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసే వారికి ఒక హెచ్చరిక అని చెప్పాలి. ఈ సంఘ్తన తర్వాత అయినా సో కాల్డ్ నాయకులు సొంత పార్టీని విమర్శించడం ఆపుతారా చూడాలి.