
కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించేవారు ఈ రూల్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఇన్నాళ్లు డ్రైవింగ్ లైసెన్స్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటి గుర్తింపు కార్డులను రుజువు చూపించి పాన్ కార్డును పొందే అవకాశం ఉండేది. కానీ, ఇకపై ఆ ఛాన్స్ లేదు. కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారు కచ్చితంగా తమ ఆధార్ను వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందే.
ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ప్రకటించింది. మంగళవారం నుండి ఈ నిబంధన అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. అలాగే ఆల్రెడీ పాన్ కార్డు కలిగి ఉన్న వారు ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ పేర్కొంది. ఒకవేళ ఈ నిబంధన పాటించకుంటే పాన్ కార్డులు డి-యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి హెచ్చరించింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు