కల్యాణ్ దిలీప్ సుంకర.. జనసేనను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి పరిచయం అవసరంలేని పేరు. నిజానికి జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కత్తి మహేష్ గొడవతోనే వెలుగులోకి వచ్చాడు. ఆ వివాదం సర్దుమణగడంలో కీలకపాత్ర వహించింది కల్యాణే. ఇక అప్పటినుండి జ‌న‌సేన పార్టీ ప్రతినిధిగా చెలామ‌ణీ అవుతూ టీవీ ఛాన‌ల్స్  డిబేట్ల లో ప్రత్యర్థులు పార్టీ పై చేసే విమ‌ర్శ‌లను ధీటుగా తిప్పికొడుతూ వచ్చాడు.


నిన్న సామాజిక మాధ్యమాలలో జనసేన పార్టీని వీడనున్నట్లుగా  పోస్టులు చేసి జనసేన కార్యకర్తలని అయోమయానికి గురిచేశాడు. అయితే తాను జనసేనను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నాడంటూ ఒక వార్తా ఛానెల్ ఏకంగా కథనాన్ని ప్రచురించింది. దీనిపై దిలీప్ ఘాటుగానే స్పందించాడు. డోనాల్డ్ ట్రంప్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నా అని రాయించాల్సిందిగా జనసేన మీడియా విభాగం అధ్యక్షడుకి చురకలు అంటించాడు.


ఎదవ రాజకీయ తెలివితేటలు నా దగ్గర చూపించవద్దు అని తెలిపాడు. పనిలోపనిగా ఆ కథనాన్ని ప్రచురించిన వార్తా ఛానెల్ ను కూడా విమర్శించాడు. ఆ ఛానెల్ విలేఖరి ఎప్పుడూ జనసేన పార్టీ ఆఫీస్ వద్ద ఎవడి చుట్టూ తిరుగుతాడో నాకు తెలుసు. ఇలాంటి పాచిపోయిన తెలివితేటలు ఇంకెక్కడైన వాడండి అంటూ ఘాటు ట్వీట్లు చేశాడు. అయితే ఈరోజు కొన్ని కీలకమైన ఫోన్ కాల్స్ మాట్లాడటం జరిగింది. హైదరాబాద్ లో జరిగే మీటింగ్ తరువాత లేని నిందలు నా పై మోపే వారికి కూడా చెక్ పెడతా అని ఇంకో ట్వీటులో పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: