తాను పెళ్లి చేసుకునేందుకు ఓ పెళ్లి కూతురుని చూడాలని 45 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ సహాయ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విచిత్రమైన వైరల్ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన అప్లికేషన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వం స్థానికంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రిలీఫ్‌ క్యాంప్‌లని ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో జూన్ 3 వ తేదీన దౌసా జిల్లాలోని సికంద్రా ప్రాంతంలో గంగద్వాడి గ్రామం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సహాయ శిబిరాన్ని సిద్ధం చేసింది. అయితే ఆ గ్రామానికి చెందిన కైలాష్ మహావర్ అలియాస్ కల్లు మహావర్ (45) అనే వ్యక్తికి ఇప్పటి దాకా పెళ్లికాలేదు. అతనికి ఓ అక్క ఇంకా ముగ్గురు సోదరులు ఉన్నారు. ప్రస్తుతం కైలాష్‌ అతని తమ్ముడి వద్ద ఉంటూ షాపుల్లో పనిచేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు.ఆయన తోబుట్టువులందరికీ కూడా పెళ్లిళ్లు కాగా తనకు మాత్రం పెళ్లి కాకపోవడంతో ఏకంగా ప్రభుత్వానికి అతను అర్జీ పెట్టుకున్నాడు.


ఈ క్రమంలో తనుకు పెళ్లి చేసుకోవడానికి భార్య కావాలంటూ తహసీల్దార్‌కు ఆయన దరఖాస్తు అందించాడు. అందులో తనకు ఎలాంటి భార్య కావాలో కూడా అతను వివరించాడు.ఇక తనకు కాబోయే భార్య సన్నగా మెరుపు తీగలాగా ఉండాలని, ఆమె వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని, అలాగే ఇంటి పనిలో తగిన నైపుణ్యం కూడా ఉండాలని పేర్కొన్నాడు. ఇక కైలాష్ మహావర్ సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన తహసీల్దార్ అతనికి పెళ్లి జరిగేలా చర్యలు తీసుకుంటానని అతనికి హామీ ఇచ్చారు. ఆ తరువాత కైలాష్ మహావర్ అర్జీని గ్రామ కార్యదర్శికి సిఫార్సు చేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఓ బృందాన్ని సిద్ధం చేయాలని తహసీల్దార్‌ ఆదేశించారు. ఇక భార్య కోసం కైలాష్ మహావర్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునున్న విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా కూడా తెలిసింది.దీంతో అతని ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: