ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండు నెలల నుంచి ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపి లో 13 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు నేడు జారీ అయ్యాయి. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి బదిలీ కాగా జిఏడి లో విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ ఎస్పీ గా శ్రీముషి బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేసారు.

డిజిపి ఆఫీసు మంగళగిరిలో రిపోర్టు చేయాల్సిందిగా నారాయణ నాయక్ కు ఆదేశాలు ఇచ్చారు. కోయ ప్రవీణ్ ను అక్టోపస్ ఎస్పీగా బదిలీ చేసిన సర్కార్...  రవాణా సంస్ధకు పూర్తి అధనపు భాద్యతలు సైతం అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విక్రాంత్ పాటిల్ ను విజయనగరం ఏపిఎస్పీ 5 వబెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసారు. ఆర్ ఎన్ అమ్మిరెడ్డిని మంగళగిరి డిజిపి ఆఫీసులో  ఏఐజి లా అండ్ ఆర్డర్ కు బదిలీ చేసింది సర్కార్.

మల్లికా గార్గ్ ను ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ చేయగా రాహూల్ దేవ్ సింగ్ ను విజయవాడ రైల్వే ఎస్పీగా బదిలీ చేస్తూ సిఎస్ ఆదేశాలు ఇచ్చారు. అజితా వేజెండ్ల ను మంగళగిరి, 6వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేయగా సుమిత్ సునీల్ ను కాకినాడ ఏపిఎస్పీ, మూడవ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసారు. గౌతమి సాలి విశాఖ నగరం డిసిపి 1గా బదిలీ చేసింది ప్రభుత్వం. వకుల్ జిందాల్ ను సి ఎం ఎస్ జి ఇంటిలిజెన్స్ ఎస్పీగా బదిలీ చేసారు. ఈ మేరకు జీవో నెంబరు1181 ను సిఎస్ ఆదిత్య నాధ్ దాస్ విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: