టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యం విషయమై చంద్రబాబు లేఖ రాశారు. నోటిఫికేషన్ల జారీలో జాప్యంతో ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారని.. ఏపీపీఎస్సీ నిర్వీర్యమైనట్లుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ హామీ దృష్ట్యా మూడేళ్లుగా యువత ఎదురుచూపులు చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

అలాగే గ్రూప్‌-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన ఉందని చంద్రబాబు లేఖలో రాశారు.
అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. అస్మదీయుల కోసం గ్రూప్‌-1లో అక్రమాలకు సీఎం జగన్ తెర తీశారని చంద్రబాబు ఆరోపించారు. రెండుసార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడా రావడంతో గ్రూప్‌ 1 అభ్యర్థుల్లో ఆందోళన ఉందని.. ఈ వ్యవహారంపై  సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: