సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో టీడీపీ నేతలు అధికార వైసీపీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పట్టిసీమ, పోలవరం సహా పలు ప్రాజెక్ట్ లను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు.
పురుషోత్తమపట్నం ఎత్తిపోతలతో పోలవరం ఎడమ, కుడి కాలువల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, విశాఖకు త్రాగునీరు అందించామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పురుషోత్తమపట్నం లిఫ్ట్ నుండి మీ ప్రభుత్వం నీళ్ళెందుకు ఇవ్వలేకపోయిందో రైతులకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు అంటూ సిఎం జగన్ ని ఆయన ట్యాగ్ చేసారు.
పురుషోత్తమపట్నం ఎత్తిపోతలతో పోలవరం ఎడమ,కుడి కాలువల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, విశాఖకు త్రాగునీరు అందించాం. @ncbn గారి దార్శనికతతో @JaiTDP ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పురుషోత్తమపట్నం లిఫ్ట్ నుండి మీ ప్రభుత్వం నీళ్ళెందుకు ఇవ్వలేకపోయిందో రైతులకు సమాధానం చెప్పండి @ysjagan గారు pic.twitter.com/skoFQRMVRU
— devineni Uma (@DevineniUma) June 26, 2020