తాము అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలకు 10లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రానున్న
అసెంబ్లీ ఎన్నికల కోసం.. పట్నాలో
పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్,సీపీఐ,సీపీఎంతో కలిసి బిహార్ ఎన్నికల్లో 'మహాకూటమి'గా బరిలో దిగనుంది ఆర్జేడీ. మహాకూటమికి సంబంధించిన మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేశారు.
243
అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28, వచ్చే నెల 3,7 తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.