తాము అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలకు 10లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్​జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. పట్నాలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్​,సీపీఐ,సీపీఎం​తో కలిసి బిహార్​ ఎన్నికల్లో 'మహాకూటమి'గా బరిలో దిగనుంది ఆర్​జేడీ. మహాకూటమికి సంబంధించిన మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేశారు.


243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28, వచ్చే నెల 3,7 తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: