సాధారణంగా పెళ్లీడుకు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలనే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో సంబంధాలు చూసి ఇక మంచివాడుని సెలెక్ట్ చేసి పెళ్లి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయడానికి ఎన్నో సంబంధాలు చూశారు. ఈ క్రమంలోనే ఐటి హబ్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తితో సంబంధం కుదిరింది. ఇద్దరి కులాలు ఒకటి కావడంతో పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇక ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు నూతన వధూవరులు.


 అయితే వధువుకు  ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి అక్క అంటే ప్రాణం. అయితే ఇక వివాహం చేసుకున్న మూడేళ్ళ తర్వాత ఇక అక్క కు కష్టం వచ్చింది. విడాకులు కావాలంటూ కోర్టు వరకు వెళ్లారు. అక్క జీవితం నాశనమైపోయింది అంటూ కోపంతో రగిలిపోయిన బావమర్ది చివరికి భార్య పై దాడి దాడి చేశాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. నాగేష్ అనే యువకుడు ఐటీ హబ్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లా లో తీర్థ హళ్లి లో గౌతమి అనే యువతి నివాసం ఉంటుంది.


 అయితే ఇక గౌతమికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఇక నాగేష్ అనే యువకుడు గురించి గౌతమి తల్లి దండ్రులకు తెలిసింది. ఈ క్రమంలోనే నాగేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడగా ఇక పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు వధూవరులు ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు. అంగరంగ వైభవంగా జరిపించాడు. మూడేళ్ల వరకు వీరి దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు రాకుండా అంత సాఫీగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. పంచాయతీ లు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నాడు ఇద్దరు దంపతులు.  ఇక అక్క జీవితం పాడైపోతుంది అని ఆగ్రహంతో ఊగిపోయిన బావమర్ది గగన్ నగేష్ ఆఫీసు లోకి వెళ్లి దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న ఆయుధంతో భావను పొడి ఇనుప రాడ్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: