యంగ్  హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ  రాక్షసుడు ఇటీవల విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది.  ఇక ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద  రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 11.70 కోట్ల షేర్ ను రాబట్టింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో  ఈచిత్రం 14 రోజుల్లో 10.60 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువవుతుంది. ఈ సినిమాకు ఇటీవల విడుదలైన శర్వానంద్ , రణరంగం అలాగే అడివి శేష్ ,ఎవరు చిత్రాలనుండి  గట్టి పోటీ ఎదురువవుతుంది.  అయితే  రాక్షసుడు  ఇక్కడ పర్వాలేదనిపించింది కానీ  యూస్ లో మాత్రం  అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోవడంతో అక్కడ ఈ సినిమా ప్లాప్ సినిమాల జాబితాలో చేరిపోనుంది.   ఓవర్సీస్ లో ఈ చిత్రం 80లక్షల  రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఇప్పటివరకు 70లక్షలను మాత్రమే రాబట్టింది. అక్కడ దాదాపుగా  ఈసినిమా రన్ ముగిసినట్లే.


ఇక ఎప్పటినుండో  బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న  సాయి శ్రీనివాస్ కు  ఈచిత్రం ఆ రేంజ్  హిట్  అయితే ఇవ్వలేకపోయింది కానీ వరుస పరాజయాలకు  బ్రేక్ వేసి  ఈ హీరో కి  ఊరటనిచ్చింది.  కోలీవుడ్ లో బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించిన  సైకో థ్రిల్లర్  మూవీ 'రాక్షసన్' కు  రీమేక్  గా తెరకెక్కిన  ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కు జోడీగా  అనుపమా పరమేశ్వరన్   నటించగా 'రైడ్' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. గిబ్రాన్ సంగీతంఅందించిన  ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు , హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించారు.  అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేసింది.  ఇక ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్ ఇంకా కొత్త చిత్రానికి సైన్ చేయలేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: