మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం లూసిఫర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై 100కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈసినిమా మళయాలం తోపాటు తెలుగులో కూడా విడుదలైయింది కానీ తెలుగు ప్రేక్షకులు లూసిఫర్ ను పట్టించుకోలేదు. ఇక ఇటీవల ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాంతో ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి ఈ రీమేక్ లో హీరోగా నటించనున్నాడు. సాహో ఫేమ్ సుజీత్ ఈసినిమా ను డైరెక్టర్ చేయనున్నాడు. దసరాకు ఈసినిమా లాంచ్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కుష్భు ,చిరు చెల్లలి పాత్రలో నటించనుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ అయితే అధికారికంగా మాత్రంఎలాంటి సమాచారం వెలుబడలేదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.
ఇక
చిరంజీవి ప్రస్తుతం టాప్
డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య లో నటిస్తున్నాడు. ఈ
సినిమా పూర్తి చేశాక లూసిఫర్
రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆచార్య విషయానికి వస్తే ఇప్పటివరకు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లో తిరిగి షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో
కాజల్ కథానాయికగా నటించనుండగా
మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్,
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్
రెడ్డి ,
రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమా థియేటర్లలోకి రానుంది.