సనమ్ రే, సుల్తాన్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటీమణి ఊర్వశి రటేలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను బాగా మెచ్చుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న పూజాహెగ్డే దక్షిణాది సినిమా ఇండస్ట్రీ పై ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రోడ్డు చూపియండి ఈ కాళ్లను ఎక్కువ చేయడానికి ఈ సౌత్ వాళ్ళకి మా అందాలు చూసి సొల్లు కార్చుకోవడం తప్ప నటనా ప్రతిభపై ఏమాత్రం ఆసక్తి కనబరిచరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో యావత్ దక్షిణ భారతదేశం ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసింది.


గతంలో తాప్సీ పన్ను కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్త పేరు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమని చులకన చేసి మాట్లాడింది. చాలామంది వీరిని విమర్శిస్తూ ఉంటే.. కొందరు మాత్రం.. బొడ్డు పై కొబ్బరిబొండాలు వేయటం ఎందుకని.. వీళ్లిద్దరే కాదు మిగతా హీరోయిన్లు కూడా తెలుగు సినిమాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఇప్పటికైనా కాస్త హీరోయిన్ల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని హితబోధ చేస్తున్నారు. అయితే ఇంతటి విమర్శలను ఎదుర్కొన్న తెలుగు చిత్ర పరిశ్రమపై ఒక బాలీవుడ్ నటీమణి గొప్ప వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.


ముందస్తుగా చెప్పినట్టే నటీమణి ఊర్వశి  టాలీవుడ్ పరిశ్రమ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె తెలుగు లో బ్లాక్ రోస్ అనే ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్ చిత్ర టెక్నీషియన్లు గాని దర్శకనిర్మాతలు గాని వేగంగా సినిమాలు పూర్తి చేస్తారని ఆమె పొగిడారు. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ సినిమా వాళ్ళు చాలా వేగంగా సినిమాలను తెరకెక్కిస్తారని ఆమె అన్నారు. కేవలం వేగంగా రూపొందించడం మాత్రమే కాదు. మంచి సినిమాలను రూపొందించడంలో కూడా టాలీవుడ్ పరిశ్రమ బాలీవుడ్ కంటే ముందంజలో ఉంటుంది అని ఆమె బాహాటంగానే టాలీవుడ్ పరిశ్రమను తెగ పొగిడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: