పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా పవన్ తో కలిసి రానా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా దీనిని యువ దర్శకుడు సాగర్ కె చంద్ర ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు సమాచారం. మలయాళంలో విజయవంతం అయిన అయ్యప్పనుం కోషియం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ లో టైటిల్ రోల్ ని పవన్ కళ్యాణ్ పోషిస్తుండగా డ్యానియేల్ శేఖర్ పాత్రలో రానా కనిపించనున్నారు.

నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ  మూవీకి థమన్ సంగీత దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రిప్ట్ అందిస్తున్న ఈ మూవీని కరోనా పరిస్థితుల తగ్గుదలని బట్టి ఈనెల 25న లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. మరోవైపు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన నాలుగు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా త్వరలో ఐదవ సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ మూవీ మొత్తంగా రూ. 100 కోట్లకు పైగా అన్ని ప్రాంతాల బిజినెస్ ని నేడు పూర్తి చేశారట.

చాలా ఏరియాల్లో ఈ సినిమా భారీ ధరకు అమ్ముడైందని, తప్పకుండా వకీల్ సాబ్ తరువాత పవన్ నుండి వస్తున్న ఈ భీమ్లా నాయక్ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ఒరిజినల్ మలయాళ మాతృక కథని తీసుకుని కొంతవరకు మార్పు చేసి మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సాగర్ తెరకెక్కిస్తున్నారట. మరి తొలిసారిగా పవన్, రానా ల కాంబోలో రానున్న బీమ్లా నాయక్ ఎంతవరకు ప్రేక్షకాభిమానులని అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: