పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మూవీ వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ విధంగా తన ప్రతి సినిమాతో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకునే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా భీమ్లా నాయక్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. రానా మరొక కీలక రోల్ చేసిన ఈ మూవీకి సాగర్ కె చంద్ర దర్శకుడు.
ఇక ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. యువ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు అనే యోధుడి పాత్ర చేస్తుండగా దీనిని పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ గా దర్శకుడు క్రిష్ తీస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ రిలీజ్ అవనున్నట్లు టాక్. ఇక దీని అనంతరం హరీష్ శంకర్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు పవన్.
మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ని ఖరారు చేసిన ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుండగా ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ మూవీలో పూజానే హీరోయిన్ గా ఫిక్స్ చేసిన యూనిట్, త్వరలో అఫీషియల్ గా ఆమెను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా పవర్ స్టార్ ప్రక్కన పూజాని చూడవచ్చు.  కాగా ఈ మూవీ త్వరలో పట్టాలెక్కి వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: