విజయ్
దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్
సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా
మైక్ టైసన్ ఓ కీలకపాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సినిమాలోని ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేయడానికి సిద్ధమయ్యింది.
21వ తేదీన
సుదర్శన్ థియేటర్లో ఈ
సినిమా యొక్క టైలర్ విడుదల చేస్తుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి
హీరో విజయ్
దేవరకొండ తో పాటు
హీరోయిన్ అనన్య పాండే అలాగే నిర్మాతలు చార్మి మరియు
కరణ్ జోహార్ అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా పాల్గొనబోతున్నారు. ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ
సినిమా యొక్క ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిని కలబరుస్తున్నారు.
ఇప్పటికే ఈ
సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. చాలా రోజుల తర్వాత తెలుగు
సినిమా పరిశ్రమలో వస్తున్న భారీ బడ్జెట్
సినిమా కాబట్టి అందరూ కూడా ఈ
సినిమా చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి విజయ్
దేవరకొండ హీరోగా నటిస్తున్న
సినిమా విడుదలై రెండు సంవత్సరాలు దాటిన క్రమంలో ఇప్పుడు రాబోతున్న ఈ
సినిమా ఏ స్థాయిలో అదరగొడుతుందో చూడాలి. ఇకపోతే ఈ టైలర్ లాంచ్
ఈవెంట్ కోసం భారీ సన్నాహాలే చిత్ర బృందం చేసినట్లుగా తెలుస్తుంది. అభిమానులందరూ కూడా
బైక్ ర్యాలీతో చిత్ర బృందాన్ని స్వాగతం పలుకుతారని తెలుస్తుంది. ఇక థియేటర్లో కూడా ఎంతో సందడి నెలకొంటుందని వారు చెబుతున్నారు. మరి ఈ
ఈవెంట్ ఎంతటి సందోహంగా జరుగుతుందో చూడాలి.