విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మైక్ టైసన్ ఓ కీలకపాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సినిమాలోని ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేయడానికి సిద్ధమయ్యింది.

21వ తేదీన సుదర్శన్ థియేటర్లో ఈ సినిమా యొక్క టైలర్ విడుదల చేస్తుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే అలాగే నిర్మాతలు చార్మి మరియు కరణ్ జోహార్ అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా పాల్గొనబోతున్నారు. ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిని కలబరుస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కాబట్టి అందరూ కూడా ఈ సినిమా చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా విడుదలై రెండు సంవత్సరాలు దాటిన క్రమంలో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో అదరగొడుతుందో చూడాలి. ఇకపోతే ఈ టైలర్ లాంచ్ ఈవెంట్ కోసం భారీ సన్నాహాలే చిత్ర బృందం చేసినట్లుగా తెలుస్తుంది. అభిమానులందరూ కూడా బైక్ ర్యాలీతో చిత్ర బృందాన్ని స్వాగతం పలుకుతారని తెలుస్తుంది. ఇక థియేటర్లో కూడా ఎంతో సందడి నెలకొంటుందని వారు చెబుతున్నారు. మరి ఈ ఈవెంట్ ఎంతటి సందోహంగా జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: