నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ మూవీ లలో నటించి తెలుగు నాట తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలా తెలుగు నాట తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలక్రిష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో బాలకృష్ణ అఘోర గా , రైతుగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు.

ఇలా అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో శృతి హాసన్, బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. దునియా విజయ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మూవీ బాలకృష్ణ కెరీర్ లో 108 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక కేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతుంది. ఇప్పటికీ షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ మూవీ విడుదల తేదీ విషయంలో మూవీ యూనిట్ ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: