పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే..ఈ సినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేయగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న పింక్ సినిమాని తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరి సంవత్సరం విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను తెలుగులోకి పవర్ స్టార్ రిమేక్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఆయనతో పాటు భల్లాలదేవ  రానా కూడా నటించడం విశేషం.

అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే మలయాళం ఒరిజినల్ సినిమాలో ఆడక చెక్క అనే ఫోక్ సాంగ్ మంచి ఫేమస్ అయింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ తెలుగులో ఈ పాటని పాడబోతున్నారు అంట. ఆయన ఇప్పటికే అత్తారింటికి దారేది , ఆజ్ఞతవాసి లాంటి సినిమాల్లో పాటలు పాడారు. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ గొంతు సవరిస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ ఆయనకి బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక మలయాళం ఒరిజనల్ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్ చాలా మార్పులు చేశాడట.ఇక ఈ సినిమాలో పవన్ కి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నదని టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ కి ఈ సినిమాలో కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ని అదనంగా పెట్టబోతున్నారు అని టాక్. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చూస్తున్నారు. కరోన లాక్డౌన్ పూర్తి అయ్యిన వెంటనే ఈ సినిమాల షూటింగ్స్ మొదలుకాబోతున్నాయి.ఈ అయ్యప్పన్ కోషియన్ రీమేక్ సినిమా ఈ ఏడాది చివరలో అన్న లేక వచ్చే ఏడాది సమ్మర్ లో అన్న విడుదల కాబోతుంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: