ఇప్పుడు మరోసారి చిరంజీవితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది వైసీపీ. రాజమహేంద్రవరంలో దివంగత హాస్య నటుడు, తన మామ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్నిమెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలో ఈ మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు మెగాస్టార్. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ తరఫున అల్లు అరవింద్, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమానికి వైసీపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలరావుతో పాటు ఎంపీలు మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా హజరయ్యారు. ఓ వైపు తమ్ముడు పవన్తో వైరం కొనసాగిస్తూనే... మరోవైపు అన్న చిరంజీవిని దగ్గర చేసుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు మరోసారి చిరంజీవితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది వైసీపీ. రాజమహేంద్రవరంలో దివంగత హాస్య నటుడు, తన మామ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్నిమెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలో ఈ మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు మెగాస్టార్. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ తరఫున అల్లు అరవింద్, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమానికి వైసీపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలరావుతో పాటు ఎంపీలు మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా హజరయ్యారు. ఓ వైపు తమ్ముడు పవన్తో వైరం కొనసాగిస్తూనే... మరోవైపు అన్న చిరంజీవిని దగ్గర చేసుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.