ఇక తొలిరోజుల నుంచి ఇప్పటిదాకా సాక్షి ఫ్యామిలీ ఇండస్ట్రీ పెద్దలతో మంచి సంబంధాలే నెరపింది.డబుల్ ధమాకా పేరిట వార్తలు ఇచ్చింది. మెగా బ్రదర్స్ తో ట్రిపుల్ ధమాకాకు ప్లాన్ చేసింది.పవన్ రాజకీయాల్లోకి రానంత వరకూ సాక్షి తనదైన కవరేజీని ఆయనకు కూడా ఇచ్చింది.ఆయన రాజకీయాల్లోకి రాగానే సీన్ మారిపోయింది. సాక్షి స్వరం మారిపోయింది.దాంతో ఇండస్ట్రీలో కొందరు జగన్ కు వ్యతిరేకులుగా మారిపోయారు.
రాఘవేంద్రరావు కానీ సురేశ్ బాబు కానీ మిగతావాళ్లెవ్వరూ కూడా పెద్దగా జగన్ దగ్గర మాట్లాడేందుకు మొదట్నుంచి ఇష్టపడడం లేదు. కానీ వీళ్లంతా టీడీపీ హయాంలో బాగానే ఉన్నారు. విశాఖ స్టూడియో కు స్థలం కేటాయింపు చేసిందే తెలుగుదేశం పార్టీ.ఆ స్థలం వివాదంలోనే వైసీపీకి, సురేశ్ బాబుకు వివాదాలు వచ్చాయి. అవే ఇవాళ టికెట్ వివాదానికి దారి ఇచ్చాయి. కనుక రేపటి వేళ విశాఖ కేంద్రంగా కమ్మ సామాజికవర్గం నేతృత్వంలో స్టూడియోలు వచ్చినా వాటిపై రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం అన్నది తప్పదు. అందుకే ఈ రెండు సామాజికవర్గాల పోరులో పవన్ ఓడిపోతున్నాడు అన్నది నిజం.