పేటీఎమ్ గురించి అందరికి తెలిసిందే.. మనీ లావాదేవీల కోసం అందుబాటులోకి వచ్చిన డిజిటల్ యాప్.. అచ్చం ఈ యాప్ మాదిరిగా సీఎం పేరుతో మరో యాప్ సంచలనంగా మారింది.దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…


వివరాల్లొకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో కూడిన “PayCM” పోస్టర్లు నగరంలో ని పలు ప్రాంతాల్లో కనిపించాయి. విరివిగా ఉపయోగించే డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం ను పోలి ఉన్నాయి. “40 % ఇక్కడ అంగీకరించబడింది” అని ఈ పోస్టర్ల పై క్యాప్షన్స్ ఇచ్చారు. QR కోడ్ మధ్యలో బొమ్మై చిత్రపటం ఉంది. పబ్లిక్ కాంట్రాక్టులు, ప్రభుత్వ నియామకా ల్లో అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం బసవరాజు బొమ్మై అవినీతిని ఎండగడుతూ రాష్ట్ర రాజధాని బెంగళూరు లో పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయం లో ఈ పోస్టర్లు బయటకు రావడం కలకలం రేపింది. పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులు పొందడానికి కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ చెల్లించాలని కాంట్రాక్టర్ల సంఘం ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఈ పోస్టర్ల ను తొలగించారు. ఈ ఘటన పై స్పందించిన అధికార బీజేపీ.. ఇది కాంగ్రెస్ హస్తమేనని ఆరోపించింది. ఇందులో సందేహానికి ఆస్కారం లేదని అధికారపక్ష నేతలు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ కు ఆదేశించారు. ఈ చర్య వెనుక ఎవరున్నా రో బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర వర్గం సీఎం కు విజ్ఞప్తి చేసింది. అవినీతికి పాల్పడినట్లు ఫ్రూఫ్ ఉంటే సమర్పించాలని, లేకుంటే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని ఖాస్లే సవాల్ విసిరారు..ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: