పాక్ ఆర్థిక సంక్షోభం కూరుకుపోతుంది.  ఐఎంఎఫ్‌ లోన్లు రావడం లేదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి. వ్యాపార వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చైనా కూడా అప్పులు ఇవ్వడం లేదు. పాక్ లో పూర్తిగా అస్థిరత నెలకొంది. ఈ మధ్య పాకిస్థాన్ లో  పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. అయితే ఎప్పుడూ పాక్ లో భారత్ గురించి ద్వేషం గా మాట్లాడే నేతలు ఆర్థిక పరిస్థితి కుదేలైన తర్వాత ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తోంది. పాక్ పార్లమెంట్ లో జరిగిన సమావేశాల్లో అక్కడి నేతలు భారత్ తో స్నేహం కావాలని అడిగినట్లు సమాచారం. పాక్ ప్రధానిగా షాబాద్ షరీఫ్  ఉన్నారు.


అక్కడ జరిగిన సమావేశంలో షరీఫ్ కూడా పాల్గొన్నారు. పుల్వామా, పఠాన్ కోఠ్ లాంటి దాడుల తర్వాత ఇండియా పాక్ లు తమ రాయబారులను ఆయా దేశాల్లో నిషేధించాయి. ఇలా నిషేధించిన కారణంగా పాక్ తో భారత్ కు ఎలాంటి సంబంధాలు లేవు. మన దేశంలో మన సైనికులపై దాడులు చేస్తూ పరోక్షంగా తీవ్ర వాదులకు శిక్షణనిస్తుంటుంది పాక్ ఆర్మీ. పాక్ ప్రభుత్వం కూడా పాక్ ఆర్మీ కనుసన్నల్లోనే పని చేస్తుంటుంది. ఇప్పుడు పాక్ తమ రాయబారిని భారత్ లో నియమించేందుకు ఆసక్తి కనబరుస్తోంది.


అంటే పరోక్షంగా భారత్ ను సాయం చేయమని అడిగేందుకు ప్రయత్నం చేస్తోందన్న మాట. కానీ పాకిస్థాన్ ను అసలు నమ్మకూడదని, పాక్ ను నమ్మడం వల్ల కలిగే ఇబ్బందులు అన్ని ఇన్నీ ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయి కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో పాక్ ను గనక ఆదుకుంటే చివరికి భారత్ కు వెన్నుపోటు పొడవటం ఖాయమని హెచ్చరిస్తోంది. కాబట్టి పాకిస్థాన్ ను అసలు నమ్మవద్దని నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: