మొదలు భూమినే సరిగ్గా చూసుకోదలచుకుంటే, దాని కోసం ప్రకృతి విరోధమైన అంశాలు ఇప్పటికే పక్కన పెట్టేవాళ్ళు అందరు. కానీ అలా జరగకుండా ఇంకా వాతావరణ అహేతుకమైన విషయాలే అందరు అనుసరిస్తున్నారు అంటే అదంతా నిర్లక్ష్యమే అని చెప్పాలి. ఇంత నిర్లక్ష్యం ఉన్న వీళ్లు రేపటి రోజున వేరే గ్రహాన్ని కూడా నాశనం చేయరు అనే నమ్మకం ఎలా వస్తుంది. ఇలా ఒక ప్రాంతాన్ని నాశనం చేసి మరో కొత్త ప్రాంతానికి వెళ్లే అలవాటు అదేదో జంతువుకు ఉంటుందని చిన్నప్పుడు కధలలో చెప్తుండేవారు. మనిషి కూడా అలాగే ఆలోచిస్తున్నదేమిటో! అతనికి కూడా మూలం జంతువే కదా, అందుకే జంతు లక్షణాలు ఎక్కడకు పోతాయి, అప్పుడప్పుడు అవి బయటపడి, మొత్తానికి భూమిని నాశనం చేశాయి(చేశారు).
2030 నాటికి అంగారక గ్రహం మీదకు మనిషి వెళ్ళాలట, అక్కడ నివాసం ఉండాలట. అందుకు బోలెడంత ఖర్చు అవుతుందని, దానికోసం ఇంధనం ఆ గ్రహం మీదనే ఉత్పత్తి చేసి, దానిని వాడుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు వైజ్ఞానికులు. అంగారకుడిపై ఫోటో బయో రియాక్టర్లు సృష్టించి, దాని సాయంతో చక్కెర అణువులను తయారు చేయడం ద్వారా రాకెట్ ఇంధనాన్ని తయారీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తద్వారా కాస్తైనా ఖర్చు తగ్గుతుందని వాళ్ళ ఆలోచన.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి